EPAPER

CM Revanth Reddy: నేడు యాదాద్రి, భద్రాద్రి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

CM Revanth Reddy: నేడు యాదాద్రి, భద్రాద్రి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

CM Revanth reddy visits YadagiriguttaCM Revanth Reddy Visits Yadagirigutta(Latest news in telangana): నేడు యాదగిరిగుట్టను ముఖ్యమంత్రి రేవంత్ సందర్శించనున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి యాదాద్రి వెళ్తున్నారు. ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక ఛాపర్‌లో సీఎం యాదగిరిగుట్టకు చేరుకోనున్నారు. ఇవాళ్టి నుంచి యాదగిరిగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు పూజల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ నెల 21 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.


ఆరుగురు మంత్రులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి నుంచి భద్రాచలం వెళ్లనున్నారు. అక్కడ రామయ్యను దర్శించుకోనున్నారు. ఆ తర్వాత భద్రాచలంలోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గ్రౌండ్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. తదనంతరం భద్రాచలం సీతారామ ఆలయ అభివృద్ధి, నీటిపారుదలకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అక్కడి నుంచి బయల్దేరి సాయంత్రం మణుగూరులో నిర్వహిస్తున్న బహిరంగసభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.


Related News

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

Big Stories

×