IND vs ENG Fifth Test Post Match Presentation(Today’s sports news): ఇంగ్లాండ్ తో ముగిసిన సిరీస్ లో ఘన విజయం సాధించడంపై టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఇది కుర్రాళ్ల విజయమని అన్నాడు. యువ క్రికెటర్లు అద్భుతంగా రాణించారని కితాబునిచ్చాడు. ఒత్తిడి సమయంలో రాణించి, జట్టుని కష్టకాలంలో ఆదుకున్నారని తెలిపాడు. కులదీప్ యాదవ్, యశస్వి జైశ్వాల్ అద్భుతంగా ఆడారని తెలిపాడు. చివరి టెస్టులో కులదీప్ మ్యాచ్ ని టర్న్ చేశాడని తెలిపాడు.
టెస్ట్ సిరీస్ గెలవడం అంటే మాటలు కాదని అన్నాడు. జట్టు అన్నివిభాగాల్లో రాణించాల్సి ఉంటుందని తెలిపాడు. సీనియర్లందరూ ఒకరి తర్వాత ఒకరు జట్టు నుంచి వెళ్లిపోయారు. అందరూ కుర్రాళ్లే ఉన్నారు. నిజానికి వాళ్లు కూడా బాగా ఆడారు. నిరూపించుకోవాలనే తపనతో ఆడటం వల్ల జట్టుకి మేలు చేసిందని తెలిపాడు.
నాలుగో టెస్టును ధ్రువ్ జురెల్ నిలబెట్టాడు. సర్ఫరాజ్ ఆకట్టుకున్నాడు. యశస్వికి మంచి భవిష్యత్తు ఉందని తెలిపాడు. ప్రత్యర్థి బౌలర్లను నిస్సహాయ స్థితికి నెట్టేస్తున్నాడు. అది చాలా కష్టమని అన్నాడు.
ఇంక కులదీప్ లో మంచి శక్తి సామర్థ్యాలున్నాయి. ఎన్సీఏలో బాగా శ్రమించాడు. తనని దగ్గర కూర్చోబెట్టుకుని ఎన్నో చెబుతుంటామని తెలిపాడు. మొత్తానికి టీమ్ ఇండియా సమష్టి కృషితో రాణించిందని తెలిపాడు.
Read More: పరుగుల్లో యశస్వి , వికెట్లలో అశ్విన్ టాప్
అటువైపు నుంచి ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ టీమ్ ఇండియాలో యువ క్రికెటర్ల వల్లనే పరాజయం పాలయ్యామని తెలిపాడు. వారిని కట్టడి చేయలేకపోయామని తెలిపాడు. ఈ సిరీస్లో ఓడినా ఎన్నో సానుకూలంశాలు లభించాయని, సమ్మర్ మ్యాచ్లకు ముందు ఇవి తమకు ఎంతగానో ఉపయోగపడుతాయని అభిప్రాయపడ్డాడు.
ఈ సిరీస్లో ఓడినా ఎన్నో సానుకూలంశాలు లభించాయని, సమ్మర్ మ్యాచ్లకు ముందు ఇవి తమకు ఎంతగానో ఉపయోగపడుతాయని అభిప్రాయపడ్డాడు.
బజ్బాల్ అర్థం ఏంటనే ప్రశ్న మాకు ఈ సిరీస్ ద్వారా ఎదురైందని అన్నాడు. బజ్బాల్ అంటే జట్టుగా.. వ్యక్తిగతంగా మెరుగైన ప్రదర్శన చేయడం. ఈ సిరీస్లో ఓడినా మాకు కొన్ని లోపాలున్నాయి. వాటిని సరిదిద్దుకొని రాబోయే మ్యాచ్ల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామని తెలిపాడు. ఈ సిరీస్ను మొత్తంగా చూస్తే మాకు వచ్చిన కొన్ని అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయామని అన్నాడు. కానీ ఓటమి ఎప్పుడూ నిరాశ, బాధనే మిగుల్చుతుందని అన్నాడు.