Fire Accident in Bhopal Secretariat Building(Today news paper telugu): మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని రాష్ట్ర సచివాలయం, వల్లభ్ భవన్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భోపాల్ లో ఉన్న సెక్రటేరియట్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మూడో అంతస్తులో మంటలు చెలరేగి పొగలు రావడం గుర్తించిన పారిశుద్ధ్య కార్మికులు వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు.
Read More : వారి లక్ష్యం కుటుంబ రాజకీయం.. నా లక్ష్యం వికసిత్ భారత్ : ప్రధాని మోదీ
అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటిన అక్కడికి చేరుకుని., 20 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని తెలిపారు. కాగా.. మూడో అంతస్తులో ఉంచిన కీలకమైన డాక్యుమెంట్లు కాలిపోయినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు, అధికారులు ఆరా తీస్తున్నారు.
#WATCH | Madhya Pradesh | A massive fire breaks out at Vallabh Bhavan State Secretariat in Bhopal. Firefighting operations are underway. Details awaited. pic.twitter.com/QBto0QSVIy
— ANI (@ANI) March 9, 2024