Telangana High Court latest news(TS today news): వేల కోట్ల విలువ చేసే గచ్చిబౌలి భూమి విషయంలో హైకోర్టు కీలక తీర్పు నిచ్చింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25 లోని 800 ఎకరాలు ప్రభుత్వానివేనంటూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. 2003లో నాటి చంద్రబాబు ప్రభుత్వం IMG భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కు 850 ఎకరాలు కేటాయిస్తూ ఒప్పందం కుదుర్చుకుంది.
2007లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని ఆ భూమిని వెనక్కి తీసుకుంటూ చట్టం చేసింది.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయంపై IMG భారత్ హైకోర్టునాశ్రయించింది. IMG భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటైన 4 రోజుల్లోనే 850 ఎకరాలు ఇచ్చేలా ఒప్పందం ఎలా చేస్తారని చంద్రబాబు ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది.
Read More: ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ.. పాతబస్తీ మెట్రో శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి..
కనీస విచారణ లేకుండా, అంతర్జాతీయ కంపెనీతో సంబంధాలు ఉన్నాయో లేదో తెలుసుకోకుండా, వేల కోట్ల విలువైన భూములను ఒప్పందం కుదుర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25 లో 850 ఎకరాలు ప్రభుత్వానివే అంటూ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ హై కోర్ట్ ఉత్తర్వులు ఇచ్చింది.