అయితే.. బీజేపీకి ఎన్ని సీట్లు అనే అంశాన్ని రాత్రి మీటింగ్లో నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీజేపీకి 4 ఎంపీ సీట్లు, 6 వరకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వటానికి తెదేపా, జనసేన ప్రతిపాదించగా, 8 ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్లే సీట్లైనా ఇవ్వాలని బీజేపీ కోరినట్లు సమాచారం. నేడు మరోసారి నేతలు ఈ అంశాన్ని చర్చించే అవకాశం ఉందనీ, సీట్ల పంపకం మీద ఒక స్పష్టత వచ్చాక వీరు మీడియా సమావేశంలో పాల్గొనే అవకాశముందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
Read more: పదవికి అందుకే రాజీనామా చేశా : వాసిరెడ్డి పద్మ
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400కి పైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో పాత మిత్రపక్షాలను తిరిగి ఆహ్వానించే దిశగా మోదీ, అమిత్ షాలు ప్రయత్నిస్తు్న్న సంగతి తెలసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే జేడీయూ, ఆర్ఎల్డీ ఎన్డీయే కూటమిలో చేరగా, టీడీపీ, బీజేడీనీ చేర్చుకోవాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. నేటి మధ్యాహ్నానికి సీట్ల పంపకం మీద స్పష్టత వస్తుందని, ఏ ఏ సీట్లలో ఎవరు పోటీచేయాలనేదానిపై మరోసారి మూడు పార్టీల అగ్రనేతలూ భేటీ అయ్యే అవకాశముందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ అంశం గురించి చంద్రబాబుతో బాటు ఢిల్లీ వచ్చిన నేతలెవరూ ఇప్పటివరకు స్పందించలేదు.