Stranger Enter House: సాధారణంగా దొంగలు ఒక ఇంటిని టార్గెట్ చేశారంటే కచ్చితంగా వదలరు. స్కెచ్ వేసి ఆ ఇంటిని లేదా వారనుకున్న టార్గెట్ను కచ్చితంగా రీచ్ అవుతారు. దొంగలు ఎక్కువగా సీటిలలోని ఎవరు లేని ఇళ్లలో లేదా జనాలు ఎక్కువగా ఉన్న చోట చోరీలకు పాల్పడుతుంటారు. అటువంటి ప్రదేశాల్లో అయితే వారిపని సులభంగా అవుతుంది. చోరీ అనంతరం ఎవరి కంట్లో పడకుండా సులభంగా తప్పించుకోవచ్చు. అందుకనే ఇటువంటి ప్రదేశాలు ఎంచుకొంటారు.
అయితే ఈ దొంగల్లో కూడా చాలా రకాలు ఉంటారు. కొందరు పొట్ట నింపుకోడానికి దొంగతనాలు చేస్తే.. మరికొందరు డప్పు సంపాదించడానికి, జల్సాలకు దొంగతనాలకు పాల్పడుతుంటారు. వీరిలో పొట్ట నింపుకోడానికి చోరీలకు పాల్పడే దొంగలతో పెద్ద ప్రమాదం ఏమి ఉండదు. జల్సాలకు పాల్పడే దొంగలతోనే ప్రమాదం ఉంది.
READ MORE: Boys Fighting Video: కొడితే.. గూబ గుయ్ అంది.. వైరల్ వీడియో!
దీనికి సంబంధించిన ఘటనలు అనేకం చూశాం. తరచూ పత్రికల్లో, సోషల్ మీడియాలో ఇటువంటి సంఘటనలు చాలానే కనిపిస్తాయి. అటువంటి వీడియోనే ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజాంపేటలో జరిగింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
అపరిచితులతో జాగ్రత్త!
ఇంట్లోకి చొరబడ్డ అనుమానాస్పద వ్యక్తిని తరిమికొట్టిన మహిళ
నిజాంపేట్ – బాచుపల్లిలో అనుమానాస్పదంగా ఇంట్లోకి చొరబడిన వ్యక్తి.. వీడియో రికార్డు చేస్తూ, ఎవరు నువ్వని అడుగుతుండగా 2వ అంతస్తు మీద నుండి దూకి పారిపోయిన వ్యక్తి. pic.twitter.com/Nc3PygGgfW
— Telugu Scribe (@TeluguScribe) March 4, 2024
వీడియో చూసినట్లయితే ఓ దొంగ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో చోరి చేసేందుకు చొరబడతాడు. అది రాత్రి సమయం కావడంతో ఇంట్లో ఎవరూ లేరని అనుకున్నాడు. కానీ చాలా మంది ఉంటారు. ఇక దొంగకు ఏమి చేయాలో తోచదు. ఇంట్లోనే మూలన కూర్చొని తప్పయింది క్షమించండని వేడుకుంటాడు.
READ MORE: వామ్మో.. పార్కింగ్ ఫీజు గంటకు రూ. వెయ్యా..!
ఇంతలో ఆ ఇంటి యజమాని పోలీసులకు ఫోన్ చేసేందుకు బయటకు వస్తుంది. దొంగ మాత్రం ఒకరు ఉండి వీడియో తీస్తూంటారు. ఫోన్ చేయొద్దు అంటూ బతిమాలతాడు. బయటకు చూస్తునట్లు గమనించి అపార్ట్మెంట్ పై నుంచి దూకేస్తాడు. అది కూడా మూడో ఫ్లోర్ నుంచి. దీంతో ఒక్కసారిగా షాక్ అవుతారు. దొంగ కింద ఉన్న గార్డెన్లో పడి పారిపోతాడు. అక్కడికి వెళ్లి చూడగా ఓ ఫోన్ ఉంటుంది. ఎంత వెతికినా ఆచూకీ మాత్రం లభించదు. అసలు అంత ఎత్తు నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడంటే అదృష్టవంతడనే చెప్పాలి. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు.