TSRTC is a Sweet Treat for Passengers, with a 10% Discount: తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరం నుండి సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే ఆర్టీసీ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్తులపై 10 శాతం రాయితీని ప్రకటిస్తూ ప్రకటించింది. ఈ సర్వీసులు తిరిగే అన్ని రూట్లలోనూ ఈ రాయితీ వర్తింపజేస్తామని తెలంగాణ ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా X వేదిక ద్వారా వెల్లడించారు.ఈ డిస్కౌంట్ ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉండనున్నట్లు సజ్జనార్ తెలిపారు.
తెలంగాణలో నూతన ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన పథకాలన్నింటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే.. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్ ప్రయాణాన్ని అమల్లోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.
Read More: 14 ఎంపీ సీట్లు గెలవాలి.. పాలమూరు సభలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు..
తాజాగా.. లహరి ఏసీ స్లీపర్ బస్సులు తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం నుండి చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు వంటి ముఖ్య పట్టణాల రూట్లలో నడుపనున్నారు. లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ సర్వీసులు హైదరాబాద్ నుండి ఆదిలాబాద్, ఆసీఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ వరకు, ఇక గోదావరిఖని నుండి బెంగళూరు, కరీంనగర్ నుండి బెంగళూరు, నిజామాబాద్ నుండి బెంగళూరు, నిజామాబాద్ నుండి తిరుపతి వరకు, వరంగల్ నుండి బెంగళూరు వరకు ఈ రూట్లలో లహరి సర్వీసులను నడపనున్నట్లు తెలుస్తోంది.