Sharwanand 35th Movie named “Manamey” Glimpse Released: టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. రెండేళ్ల క్రితం ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో ప్రేక్షకు ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ తర్వాత శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తన 35వ సినిమాను అనౌన్స్ చేసాడు.
కాగా ఆ మధ్యలో శర్వానంద్ తన ఎంగేజ్మెంట్, మ్యారేజ్ పనుల్లో బిజీ బిజీగా ఉండటంతో ఈ మూవీకి కాస్త బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమా మళ్లీ పట్టాలెక్కింది. ఈ రోజు శర్వానంద్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ని ఇవాళ అనౌన్స్ చేసారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గానూ ‘మనమే’ అనే టైటిల్ని మేకర్స్ ఖరారు చేసారు. ఇందులో యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఇక టైటిల్ అనౌన్స్ చేస్తూ గ్లింప్స్ని రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్లో శర్వానంద్, హీరోయిన్ కృతిశెట్టిని, అలాగే ఒక చిన్న బాబుని చూపించారు.
READ MORE: పవన్ కల్యాణ్ హీరోయిన్ కృతి కర్బంద, పుల్కిత్ సామ్రాట్ పెళ్లి కార్డు వైరల్..
దీని బట్టి చూస్తే ఈ మూవీ నాని ఇటీవల నటించిన ‘హాయ్ నాన్న’ మాదిరిగా ఉండబోతుందా? లేదా ఇంకో కొత్త పాయింట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోందా అనేది చూడాలి. ప్రస్తుతం అందుకు సంబంధించిన గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
కాగా ఈ మూవీలో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తనయుడు విక్రమ్ ఆదిత్య ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఓ నాలుగేళ్ల బాబు చుట్టూ ఈ మూవీ తిరుగుతుందని తెలుస్తోంది. ఆ పాత్రను విక్రమ్ ఆదిత్య చేస్తున్నాడు. ఈ మూవీకి ప్రముఖ సంగీత దర్శకుడు అబ్దుల్ హేషమ్ వహబ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.