Allagadda Road Accident(Andhra pradesh today news): నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ నల్లగట్ల వద్ద హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
తిరుమల దైవ దర్శనం కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుల్లో నవ దంపతులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ వెంకటాపురానికి చెందిన మంత్రి రవీందర్ కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో ఆళ్ళగడ్డ మండలం నల్లగట్ల వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని రవీందర్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మంత్రి రవీందర్, అతని భార్య లక్ష్మి, కుమారుడు కిరణ్, కోడలు కావ్య, ఇంకో కుమారుడు ఉదయ్ కిరణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కాగా మంత్రి రవీందర్ కుమారుడు కిరణ్కు కావ్యతో ఫిబ్రవరి 29న తెనాలిలో పెళ్లి జరిపించారు. మార్చి 3న హైదరాబాద్లోని శామీర్పేట్లో రిసెప్షన్ చేశారు. నూతన దంపతులను తీసుకొని తిరుమలకు వెళ్లివస్తుండగా ఈ ఘోరం జరిగింది. దీంతో మంత్రి రవీందర్ ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.