EPAPER

Maldives – China: ఇండియాతో వివాదం.. చైనాతో మాల్దీవుల కొత్త సైనిక ఒప్పందం

Maldives – China: ఇండియాతో వివాదం.. చైనాతో మాల్దీవుల కొత్త సైనిక ఒప్పందం

Maldives Sign Military Agreement With ChinaMaldives Sign Military Agreement With China: హిందూ మహాసముద్ర ప్రాంతంలో గ్లోబల్ పాలిటిక్స్ వివిధ దశల్లో రూపాంతరం చెందుతున్న వేళ, ప్రత్యేకించి భారత్‌తో మాల్దీవుల పరస్పర చర్యలు ఉద్రిక్తత సంకేతాలను చూపుతున్న సమయంలో.. మాల్దీవులు, చైనా రెండు సైనిక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తాయని సమాచారం.


మాల్దీవుల రక్షణ మంత్రి ఘసన్ మౌమూన్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా డిప్యూటీ డైరెక్టర్ మేజర్ జనరల్ జాంగ్ బావోకున్ సోమవారం మాలేలో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపిన అనంతరం సైనిక ఒప్పందాలపై సంతకాలు చేశారు.

మాల్దీవుల మీడియా ప్రకారం, ఒక ఒప్పందానికి సంబంధించిన నిబంధనల ప్రకారం, చైనా ఎటువంటి ఖర్చు లేకుండా మాల్దీవులకు సైనిక సహాయం అందించడానికి ప్రతిజ్ఞ చేసింది. రెండు దేశాల సంబంధాలను పెంచడానికి ఈ ఒప్పందం కృషి చేస్తుంది. మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ఒప్పందాల వివరాలను వెల్లడించలేదు.


అదనంగా, చైనీస్ పరిశోధన నౌక జియాంగ్ యాంగ్ హాంగ్ 3కి సంబంధించి ఒక సమాంతర ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నౌక ఇటీవల మాల్దీవుల్లో తన ఉనికిని చాటుకుందని మాల్దీవుల మీడియా ఉదహరించింది. ఈ ఒప్పందం హిందూ మహాసముద్ర ప్రాంతం (IOR)లో సముద్ర పరిశోధనలను ప్రభావితం చేయగలదు, ఇది వారి ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేస్తుంది.

Read More: ఇజ్రాయెల్ పై మిస్సైల్ ఎటాక్ .. భారతీయుడు మృతి

కాగా ఒప్పందం జరిగిన కొద్ది సేపటికే మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఇండియాపై నోరు పారేసుకున్నాడు. మాల్దీవుల భూభాగంలో మే 10 తర్వాత భారత మిలిటరీ సిబ్బంది ఒక్కరు కూడా ఉండొద్దని హెచ్చరించారు. కనీసం సివిల్ డ్రెస్సుల్లో కూడా సంచరించొద్దని అన్నారు.

మాల్దీవుల అధ్యక్షుడుగా ముయిజ్జు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. మాల్దీవుల భూభాగంలోని మూడు వైమానిక స్థావరాల్లో భారత బలగాలు విధులు నిర్వర్తిస్తున్నాయి. కాగా ఒక స్థావరం నుంచి మార్చి 10 లోగా, మరో రెండు స్థావరాల నుంచి మే 10 లోగా ఖాళీ చేయాలని మాల్దీవుల ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని సూచించింది. ఈ మేరకు ఫిబ్రవరి 2న ఢిల్లీలో రెండు దేశాలు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దీంతో బలగాల స్థానంలో టెక్నికల్ గ్రూప్‌లను నియమించేందకు మాల్దీవుల ప్రభుత్వం అంగీకరించింది. కాగా గత వారం భారత టెక్నికల్ బృందం మాల్దీవులకు చేరుకుంది.

Read More: మేం మీ కీలు బొమ్మలం కాదు.. చైనాకు తైవాన్ స్ట్రాంగ్ కౌంటర్..

సాంకేతిక సిబ్బంది మిలటరీ వారేనని.. సివిల్ డ్రెస్సుల్లో విధుల నిర్వహిస్తున్నారని మాల్దీవుల ప్రభుత్వం ఆరోపించింది. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండియాను దూరం పెట్టడానికి మాల్దీవుల ప్రభుత్వం వైద్య సాయం, మానవతా సాయం కోసం గతవారం శ్రీలంకతో ఒప్పందం చేసుకుంది. తాజా చైనా ఒప్పందం మాల్దీవులు-భారత్ మధ్య దూరాన్ని పెంచిందని చెప్పొచ్చు.

Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×