Brazilian Tourist Gang Rape Incident(Telugu news live today):ఝార్ఖండ్లోని దుమ్కా జిల్లాలో బ్రెజిల్కు చెందిన టూరిస్ట్పై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని వచ్చిన నివేదికలను ఝార్ఖండ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.
తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ నవనీత్ కుమార్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఝార్ఖండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ), చీఫ్ సెక్రటరీ, దుమ్కా పోలీస్ సూపరింటెండెంట్లను ఈ వ్యవహారంలో స్పందన కోరింది.
“మేము వార్తాపత్రిక నివేదికల నుంచి చదివాము, ఒక స్పానిష్ మాట్లాడే వ్యక్తి ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. అనువాదకుడి సౌకర్యం ఉందో లేదో తెలియదు. సీఆర్పీసీలో చేసిన సవరణల దృష్ట్యా అత్యాచారానికి సంబంధించిన నేరాల కేసుల్లో శాస్త్రీయ దర్యాప్తుపై దృష్టి సారించడం, ఈ విషయంలో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు పురోగతిపై దుమ్కా పోలీసు సూపరింటెండెంట్ నుంచి తక్షణమే నివేదికను కోరడం అవసరం, ”అని కోర్టు పేర్కొంది.
ఝార్ఖండ్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రీతూ కుమార్ సోమవారం ఉదయం ఈ సంఘటనపై వివిధ వార్తా నివేదికల కాపీలను కోర్టుకు సమర్పించారు. ఆ తర్వాత కోర్టు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది.
ఒక విదేశీ పౌరుడిపై నేరాలు తీవ్రమైన జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను కలిగిస్తాయని.. దేశ పర్యాటక ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని కోర్టు నొక్కి చెప్పింది.
Read More: ఝార్ఖండ్లో దారుణం.. స్పెయిన్ యువతిపై గ్యాంగ్రేప్..
“విదేశీ మహిళలపై లైంగిక సంబంధిత నేరం దేశానికి వ్యతిరేకంగా ప్రతికూల ప్రచారాన్ని తెచ్చి తద్వారా ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్టను దిగజార్చే అవకాశం ఉంది” అని పేర్కొంది.
ఈ సంఘటన మార్చి 1 న, మోటర్బైక్ పర్యటనలో ఉన్న బ్రెజిలియన్ మహిళ , ఆమె భర్త దుమ్కాలో విరామం తీసుకున్నప్పుడు జరిగింది.
వెంటనే, ఆ మహిళ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియోను పోస్ట్ చేసి, భయంకరమైన సంఘటనను వివరించింది. తనపై ఏడుగురు అత్యాచారం చేశారని, తన భర్తను కొట్టారని చెప్పింది.
ఈ ఘటన అంతర్జాతీయంగా దుమారం రేపింది. ఏడుగురు నిందితులలో నలుగురిని అరెస్టు చేశారు, మిగిలిన ముగ్గురి కోసం అన్వేషణ కొనసాగుతోందని ఝార్ఖండ్ పోలీసులు తెలిపారు.