Anant ambani Radhika merchant pre wedding update: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఇక ఈ వేడుకలకు దేశంలోని ప్రముఖులే కాకుండా..విదేశాల నుండి కూడా పలువురు ముఖ్య పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఇక ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
గతవారం రోజుల నుండి దేశంలో ఎక్కడ చూసిన సరే అంబానీ వేడుకలకు సంబంధించిన ముచ్చట్లే వినిపిస్తున్నాయి. అంతేకాదు ట్రెండింగ్లోనూ దూసుకుపోతున్నాయి. అనంత్ అంబానీ, రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమైనప్పటి నుంచి చాలామంది సెలబ్రెటీల డెస్టినేషన్ జామ్నగర్ అయిపోయింది. ఇందులో మరో విశేషమేమిటంటే.. విదేశీ సంప్రదాయాలకు తావివ్వకుండా కేవలం భారతీయ సంప్రదాయాలకు పెద్దపీట వేశారు. దీంతో భారతీయులందరూ షాక్ అవుతున్నారు. అంతేకాకుండా వారి ప్రశంసలను సైతం అందుకుంటున్నారు.
When the Ambanis embrace Indian culture with pride, it matters because many people will get inspired by this.
Most importantly there are hundreds of foreign guests present here… Truly incredible!!!
#AnantRadhikaHastakshar pic.twitter.com/ypYqczoaka
— Mr Sinha (@MrSinha_) March 3, 2024
ఈ వేడుకలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మెహందీ ఫంక్షన్ నుంచి ప్రధాన వేడుక వరకు కూడా అన్నింటిని సంప్రదాయ పద్దతిలో నిర్వహించడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఈ వేడుకలకు భారీగా విదేశీయులు కొలువుదీరి ఉన్న వేదికపై అచ్చమైన భారతీయ సంప్రదాయపద్దతిలో వివాహం జరగడం అభినందనీయమని నెటిజన్లు కొనియాడుతున్నారు.
ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ గుజరాత్లోని జామ్నగర్లో మూడురోజుల పాటు ఘనంగా జరిగాయి. ఈవెంట్ చివరిరోజున స్టార్స్ నుంచి అంబానీ ఫ్యామిలీ వరకు భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. నీతా అంబానీ చేసిన డ్యాన్స్ మాత్రం వచ్చిన అతిథులను మెస్మరైజ్ చేసింది. సంప్రదాయం, ఆధ్యాత్మికతకు మేళవిస్తూ సాగిన ఈ నృత్యం చూపరులను ఆద్యంతం ఆకట్టుకుందనే చెప్పాలి.
Read More: ఇస్రో ఛైర్మన్ సోమనాథ్కు క్యాన్సర్.. ఆదిత్య ఎల్-1 ప్రయోగం రోజే నిర్ధారణ..
శక్తి, సహనానికి ప్రతిరూపమైన దుర్గాదేవిని స్తుతిస్తూ సాగిన ఈ పాటకు నీతా అంబానీ మంత్రముగ్ధులయ్యే ప్రదర్శన ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అనంత్-రాధిక కోసం తల్లి ఆశీస్సులను కోరుతూ నీతా అంబానీ ఈ ప్రదర్శన చేశారు. తమ కుమారుడు అనంత్, కోడలు రాధికా మర్చంట్ భవిష్యత్ మంచిగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులను కోరుతూ ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది.