Wanaparthy Road Accident (telugu breaking news today) : వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న కారు.. అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. టేక్కలయ్య దర్గా సమీపంలో ఎర్టిగా కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో 11 మంది ప్రయాణిస్తున్నారు.
Read More : తెలంగాణ ప్రజలూ..ఈ 5 రోజులు జాగ్రత్త.. హెచ్చరించిన వాతావరణశాఖ
డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బళ్లారి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారులో ప్రయాణిస్తున్న వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.