Dr. Harsh Vardhan Quits Politics: భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ లోక్సభ ఎంపీ డాక్టర్ హర్షవర్ధన్ ఆదివారం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. లోక్సభ ఎన్నికల 2024 అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసిన మరుసటి రోజే హర్షవర్ధన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం చాందినీ చౌక్ ఎంపీగా ఉన్న హర్షవర్ధన్ పేరు బీజేపీ ప్రకటించిన జాబితాలో లేదు. అతని స్థానంలో చాందినీ చౌక్ బీజేపీ అభ్యర్ధిగా ప్రవీణ్ ఖండేల్వాల్ పేరును పార్టీ అధిష్టానం ప్రకటించింది.
హర్షవర్ధన్ 2014, 2019లో చాందినీ చౌక్ నుంచి పోటీ చేశారు. రెండు సార్లు గెలిచారు. 2019లో డాక్టర్ హర్షవర్ధన్ 5,19,055 ఓట్లు సాధించి, కాంగ్రెస్ అభ్యర్థి జై ప్రకాష్ అగర్వాల్పై విజయం సాధించారు.
2014లో డాక్టర్ హర్షవర్ధన్ 4,37,938 ఓట్లు సాధించగా, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అషుతోష్ 3,01,618 ఓట్లు సాధించారు.
రాజకీయ రంగానికి వీడ్కోలు చెప్పడానికి గల కారణాలను పేర్కొంటూ, హర్ష్ వర్ధన్ ENT స్పెషలిస్ట్గా తన మూలాల్లోకి తిరిగి రావాలని ఎదురుచూస్తున్నానని, కృష్ణా నగర్లో తన ప్రాక్టీస్ తిరిగి ప్రారంభిస్తానని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
“నేను ముందుకు సాగుతున్నాను, నేను నిజంగా వేచి ఉండలేను. ఇంకా నేను వెళ్ళడానికి మైళ్లు ప్రయాణించాలి. నాకు చాలా వాగ్దానాలు ఉన్నాయి !! నాకు ఒక కల ఉంది. మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నాతో ఉంటాయని నాకు తెలుసు. కృష్ణా నగర్లో నా ENT క్లినిక్ నా పునరాగమనం కోసం ఎదురుచూస్తోంది’’ అని ట్వీట్ చేశాడు.
Read More: 195 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుంచి మోదీ పోటీ..
పేదరికం, అనారోగ్యం, అజ్ఞానంతో పోరాడాలనే తపనతో తాను రాజకీయాల్లోకి వచ్చానని, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అందించిన ఆంత్యోదయ తత్వానికి అనుగుణంగానే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన పేర్కొన్నారు.
పేదలకు సహాయం చేయాలనే కోరికతో యాభై సంవత్సరాల క్రితం కాన్పూర్లోని GSVM మెడికల్ కాలేజీలో MBBS చేరానని.. నాడు మానవాళికి సేవ అనేది నా నినాదంగా ఎంచుకున్నాని హర్షవర్థన్ పేర్కొన్నారు.
“ఢిల్లీ ఆరోగ్య మంత్రిగా, రెండుసార్లు కేంద్ర ఆరోగ్య మంత్రిగా పనిచేశాను, ఇది నా హృదయానికి దగ్గరైన అంశం. పోలియో రహిత భారత్ను రూపొందించడానికి మొదట కృషి చేయగలిగిన అరుదైన అవకాశం నాకు లభించింది. దాని మొదటి, రెండవ దశలలో భయంకరమైన COVID-19తో పోరాడుతున్న మిలియన్ల మంది మన దేశప్రజల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునే అవకాశం నాకు లభించింది” అని హర్షవర్థన్ ట్విట్టర్ పోస్ట్లో తెలిపారు.
Read More: బీజేపీకి భోజ్పురి సింగర్ పవన్ సింగ్ షాక్.. పోటీకి విముఖత..
కాగా శనివారం బీజేపీ 195 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గుజరాత్లోని గాంధీనగర్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్షా సహా కీలక నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.
బీజేపీ తొలి జాబితాలో 34 మంది కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల పేర్లు కూడా ఉన్నాయి. కాగా, పర్వేష్ వర్మ, హజారీబాగ్ ఎంపీ జయంత్ సిన్హా, భోపాల్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్, దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేష్ బిధూరితో సహా 33 మంది సిట్టింగ్ ఎంపీల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చారు.
After over thirty years of a glorious electoral career, during which I won all the five assembly and two parliamentary elections that I fought with exemplary margins, and held a multitude of prestigious positions in the party organisation and the governments at the state and…
— Dr Harsh Vardhan (@drharshvardhan) March 3, 2024