CM Revanth Reddy: అంగన్వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంగన్వాడీ సెంటర్లలో పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు.
మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్దుల సంక్షేమశాఖ పైఅధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ హాజరు ఉండేలా చూడాలని ఆదేశించారు.
అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణాలపై దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వాటిని మొదటి ప్రాదాన్యతగా తీసుకుని భవన నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాలపై అధ్యయనం చేయాలని వెల్లడించారు. ఈ సమీక్ష సమావేశంలోమంత్రి సీతక్క, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు ఉన్నారు.