Delhi Police High Alert: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ తర్వాత ఢిల్లీ పోలీసులు దేశ రాజధానిలో భద్రతను పెంచారని శనివారం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
రద్దీగా ఉండే ప్రాంతాల్లో, ముఖ్యంగా ఢిల్లీ మార్కెట్లలో నిఘా పెంచాలని జిల్లాల పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తిస్తే మార్కెట్ అసోసియేషన్లు అప్రమత్తంగా ఉండాలని, వారి స్థానిక పోలీస్ స్టేషన్లను సంప్రదించాలని కోరినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
షాప్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని సంఘాలను ఆదేశించినట్లు తెలిపారు.
ఢిల్లీ పోలీసులు తమ బాంబు డిస్పోజల్ స్క్వాడ్లు, బాంబు డిటెక్షన్ బృందాలను అప్రమత్తంగా ఉండాలని కోరినట్లు మరో అధికారి తెలిపారు.
Read More: అది బాంబు దాడే.. బెంగళూరు రామేశ్వరం కేఫ్లో పేలుడుపై కర్ణాటక సీఎం..
బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్లో శుక్రవారం తక్కువ తీవ్రతతో పేలుడు సంభవించడంతో సిబ్బంది, కస్టమర్లతో సహా పది మంది గాయపడ్డారు.
‘కస్టమర్’ హ్యాండ్వాష్ ఏరియా దగ్గర వదిలివేసిన బ్యాగ్లో టైమర్తో అమర్చిన అధునాతన పేలుడు పరికరం కారణంగా పేలుడు సంభవించిందని బెంగళూరు పోలీసులు తెలిపారు.
స్థానిక పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేశారు.
కాగా ఈ దాడి తర్వాత నగరంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్లు హైదరాబాద్ నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.