Telangana IPS Officers Transfers(TS news updates) : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాష్ట్రంలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. తెలంగాణలో మరో నలుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు శుక్రవారమే ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబాబాద్ ఎస్పీగా సుధీర్ రామ్నాథ్..హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా ఆకాంక్ష్ యాదవ్ ను, మంచిర్యాల డీసీపీగా అశోక్ కుమార్ను నియమించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
Read More : ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ .. నిమిషం ఆలస్యం నిబంధనపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
కాగా.. మహబూబాబాద్ ఎస్పీగా పనిచేస్తున్న పాటిల్ సంగ్రామ్ సింగ్ గణపత్ రావ్ ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయన స్థానంలోనే మంచిర్యాల డీసీపీగా ఉన్న కేకన్ సుధీర్ రామ్ నాథ్ ను నియమించింది. అలాగే హైదరాబాద్ డీసీపీగా బదిలీ అయిన ఆకాంక్ష్ గవర్నర్ ఏడీసీగా పనిచేస్తున్నారు. మంచిర్యాల డీసీపీగా బదిలీ అయిన అశోక్ కుమార్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏఎస్డీగా పనిచేస్తున్నారు.