Internet Users in India : దేశంలో ఇంటర్నెట్ యూజర్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన పది సంవత్సరాలతో పోలిస్తే ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. దేశంలో మొదట 2జీ నెట్వర్క్ ఉండేది. తర్వాత అది 3జీ అయింది. జియో రాకతో 4జీ వేగం గణనీయంగా పుంజుకుంది. ఇప్పుడు 5జీ సేవలు కూడా అందుబాటులొకి వచ్చాయి. ఈ ఏడాది కోట్లాది మంది టెలికాం వినియోగదారులు 4జీ నుంచి 5జీకి మారారు.
ఎందుకంటే వినియోగదారులు ఇప్పుడు 5జీతో ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. అయితే 5జీ యుగంలో కూడా చాలా మంది ఇంటర్నెట్ను ఉపయోగింయడం లేదట. సగం మంది భారతీయులు ఇంటర్నెట్కు దూరంగా ఉంటున్నారట. దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..
Read More : ఓరి దేవుడా!.. 28,000 mAh బ్యాటరీతో కొత్త ఫోన్.. ఇంత తక్కువ ధర
ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. దేశంలో 45 శాతం జనాభాకు ఇంటర్నెట్ అందుబాటులో లేదు. దీనికి సంబంధించిన లెక్కలు చూస్తే.. 2023 నాటికి దేశంలో నివిసిస్తున్న జనాభాలో66.5 కోట్ల మందికి ఇంటర్నెట్ వాడటం లేదు.
ఇప్పుడు ఈ సంఖ్య సంఖ్య 45 శాతానికి చేరుకుంది. దేశంలోని 66.50 కోట్ల మంది యాక్టివ్గా లేని ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. కానీ గత మూడేళ్ల లెక్కలను చూస్తుంటే ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య ఏటా క్రమంగా పెరుగుతోంది. యాక్టివ్గా లేని యూజర్ల సంఖ్య సంవత్సరానికి మూడు నుంచి నాలుగు శాతం తగ్గుతోంది.
Read More : ఎండ చంపేస్తుందా?.. 5జీ ఫోన్ రేటుకే ఏసీని కొనేయండి.. ఈ ఆఫర్ మీకోసమే.
ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. దేశంలోని గ్రామాలలో నివసిస్తున్న దాదాపు సగం మంది ప్రజలు ఇంటర్నెట్ సేవలకు దూరంగా ఉన్నారు. ఇంటర్నెట్కు దూరంగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
దేశంలోని యాక్టివ్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రతిరోజూ కొత్త రికార్డులు కూడా నమోదవుతున్నాయి. 2023 నాటికి దేశంలో ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య 800 మిలియన్లు అంటే 80 కోట్లు దాటింది. ఈ నివేదిక ప్రకారం 2023 నాటికి భారతదేశంలో 820 మిలియన్లు అంటే దాదాపు 82 కోట్ల మంది ప్రజలు ఇంటర్నెట్ సేవలను వినియోగించుకుంటున్నారు.