CM Revanth reddy latest news(Political news in telangana): పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు . పౌరసంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. త్వరలో రైతు, విద్యా కమిషన్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
విద్యావిధానం ఎలా ఉండాలో కమిషన్ నిర్ణయిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పంట మార్పిడి పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కౌలు రైతుల రక్షణకు చట్టం రూపొందించాలనే యోచనలో ఉన్నట్లు సీఎం తెలిపారు.
కౌలు రైతుల రక్షణకు చట్టం రూపొందించాలనే యోచనలో ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ సమీకృత గురుకుల వర్సీటీ సముదాయాన్ని నిర్మిస్తామని వెల్లడించారు. పంటల భీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని ఆయన వెల్లడించారు.
Read More: గృహజ్యోతి స్కీమ్.. జీరో విద్యుత్ బిల్లులు జారీ..
గత ప్రభుత్వంలో చిక్కుముడులు తొలగించి ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు చేపడతామన్నారు. ధర్నా చౌక్ , ప్రజా భవన్ అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలిపారు. పంటల మార్పిడి పథకాలకు ప్రదాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కౌలు రైతుల సమస్యలపై అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. అందరి సూచనలు. సలహాల ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం రూపొందించాలని యోచిస్తున్నామని ఆయన వెల్లడించారు. రైతు భరోసా అనేది పెట్టుబడి సాయం.. ఎవరికి ఇవ్వాలనే అంశంపై విస్రృత చర్చ జరగాలని కోరుతున్నామని ాయన తెలిపారు.