Sheena Bora Murder Case : ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ : ది బరీడ్ ట్రూత్.. ఈ డాక్యుమెంటరీపై పెను వివాదం రేగింది. ఎందుకంటే వాస్తవ కేసు ఆధారం తీయడంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నెట్ ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీ తెరకెక్కించింది. ఈ డాక్యుమెంటరీ విడుదలను ఆపాలని సీబీఐ కోర్టును ఆశ్రయించింది. బాంబే హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే న్యాయస్థానం ఈ పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ : ది బరీడ్ ట్రూత్ విడుదలైంది. ఇప్పుడు ఇంద్రాణి ముఖర్జీ ఎవరు? షీనా బొరాను ఎవరు హత్య చేశారు? అసలు ఈ కేసు ఏంటీ? అనే చర్చ మొదలైంది.
షీనా బొరా కేసు?
2012లో షీనా బొరా ముంబై మెట్రో-1లో ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్నారు. ఆమె అదే ఏడాది ఏప్రిల్ 14న మిస్సైయ్యారు. ఈ తర్వాత ఆమె అదృశ్యంపై దర్యాప్తు సాగింది. 3 ఏళ్ల తర్వాత షీనా బొరా హత్యకు గురయ్యారని పోలీసులు తేల్చారు. షీనా బొరా తల్లి ఇంద్రాణి ముఖర్జీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2015 అగస్టులో ఇంద్రాణి అరెస్ట్ అయ్యారు. అలాగే ఇంద్రాణి రెండో భర్త పీటర్ ముఖర్జీ, డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల ముగ్గురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ముగ్గురు నిందితులపై కిడ్నాప్, హత్య, మృతదేహాన్నిమాయం చేయడం లాంటి అభియోగాలతో కేసులు నమోదయ్యాయి.
శ్యామ్వర్ రాయ్ పై అక్రమ ఆయుధాల కేసు నమోదుకావడంతో షీనా బొరా హత్యకేసు బయటకు వచ్చింది. ఆ తర్వాత ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీగా పోలీసులు నిర్ధారించారు. షీనా బొరా మర్డర్ డిటైల్స్ ను పోలీసులు వెల్లిడించారు. ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ కలిసి షీనాను మర్డర్ చేశారని తేల్చారు. కారులోనే ఆమె గొంతును నులిమి ప్రాణాలు తీశారని నిర్ధారించారు.
Read More: బెంగళూరు రామేశ్వరం కేఫ్లో పేలుడు.. నలుగురికి గాయాలు..
షీనా బొరా హత్యపై రాయ్ పోలీసులకు అన్ని వివరాలు వెల్లడించారు. 2012 ఏప్రిల్ 24న బాంద్రాలో సంజీవ్ ఖన్నా షీనాను హత్యచేశాడని పేర్కొన్నాడు. డెడ్ బాడీని ఎక్కడ పడేయాలో ఇంద్రాణి సూచించారని తెలిపాడు. మృతదేహాన్ని.. వోర్లిలోని ఇంద్రాణి ముఖర్జీ ఇంటికి తీసుకెళ్లారని తెలిపాడు.
బ్యాగులో మృతదేహాన్ని పెట్టి.. కారులో ఇంద్రాణి ముఖర్జీ, సంజీవ్ ఖన్నా , రాయ్ గగోడే గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడే మృతదేహాన్ని పడేశారు. పోలీసులు కథనం ప్రకారం సంజీవ్ ఖన్నా , రాయ్ నేరాన్ని ఒప్పుకున్నారు. కానీ ఇంద్రాణి నేరాన్ని అంగీకరించలేదు. షీనా బొరా అమెరికాలో ఉంటోందని కట్టు కథ అల్లారు. ఇంద్రాణి ముఖర్జీ బెయిల్ పిటిషన్ ను 2021 నవంబర్ లో బాంబే హైకోర్టు కొట్టివేసింది. 2022 మేలో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది.
హత్యకు కారణాలేంటి?
ఇంద్రాణి ముఖర్జీ ఫ్యామిలీలో జరిగిన అనేక విషయాల్లో షీనా బొరా హత్య కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. పీటర్ ముఖర్జీ మొదటి భార్య కొడుకు రాహుల్. ఆ తర్వాత పీటర్ ను ఇంద్రాణి వివాహం చేసుకున్నారు. ఇంద్రాణి కుమార్తె షీనా. రాహుల్ తో లివ్-ఇన్ రిలేషన్ తో షీనా ఉందని ఇంట్లో తెలిసింది. ఈ సంబంధాన్ని ఇరుకుటుంబాలు వ్యతిరేకించాయి. షీనా హత్యలో పీటర్ ముఖర్జీ నిందితుడే అని తేలింది. అరెస్ట్ తర్వాత ఇంద్రాణి ముఖర్జీ రకరకాల కథలు అల్లారు. షీనా బొరా తన కుమార్తె కాదన్నారు. సిస్టర్ వరుస అవుతుందని చెప్పారు. ఇదీ ఈ మర్డర్ హిస్టరీ..