2-Child Norm For Govt Jobs in Rajasthan(Latest breaking news in telugu): ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాజస్థాన్ ప్రభుత్వం విధించిన ఇద్దరు పిల్లల నిబంధనను సుప్రీంకోర్టు సమర్థించింది. ఇందులో ఎలాంటి వివక్షగానీ రాజ్యాంగ ఉల్లంఘన గానీ లేదని పేర్కొంది. రాజస్థాన్ లో వివిధ సర్వీస్ రూల్స్ ప్రకారం.. లో జూన్ 1, 2002 ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగాలు అనర్హులు.
ఇద్దరు పిల్లల నిబంధనను సమర్థిస్తూ.. 2017లో మిలటరీ నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత మే 25, 2018న రాజస్థాన్ పోలీస్లో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం మాజీ సైనికుడు రామ్జీ లాల్ దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉండటంతో ఆయన దరఖాస్తును తిరస్కరించారు. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Read More: ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా.. తగినన్ని వీల్ఛైర్లు అందించాలని డీజీసీఏ ఆదేశాలు..
ఆయన చేసిన అప్పీల్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం రాజస్థాన్ పోలీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1989లోని రూల్ 24(4) ప్రకారం.. జూన్ 1, 2002న లేదా ఆ తర్వాత ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉన్న వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కాదు అని తెలుపుతుంది.
ఇందులో ఎలాంటి వివక్షగాని రాజ్యాంగాన్ని ఉల్లంఘనగాని లేదని కోర్టు పేర్కొంది. ఎందుకంటే ఈ నిబంధన వెనుక ఉన్న లక్ష్యం కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడం ఉందని న్యాయమూర్తులు దీపాంకర్తో కూడిన ధర్మాసనం పేర్కొంది.