Nandyal : ఉమ్మడి కర్నూలు జిల్లాలో అమానుష ఘటన వెలుగుచూసింది. నంద్యాల పట్టణం చామకాల్వలో చిన్నారి మృతదేహం కలకలం రేపింది. మగ పిల్లాడి మృతదేహం కాల్వలోకి కొట్టుకొచ్చింది. గోపాల్ నగర్ వాసులు కాల్వలో ఉన్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారి చేతికి ఆసుపత్రి ట్యాగ్ ఉంది. పోలీసులు తల్లిదండ్రులను గుర్తించే పనిలో ఉన్నారు.