అయితే 15మంది స్క్వాడ్ లో ఉన్నా లేకపోయినా, ప్రతి ఏడాది వీరికి కాంట్రాక్టు సొమ్ము విధిగా బీసీసీఐ వీరి ఖాతాలో వేసేస్తుంది. అయితే ఆ సంవత్సరం వీరు జాతీయ జట్టుకి ఆడకపోయినా, ఇతర లీగ్ మ్యాచ్ లు, దేశవాళీ టోర్నమెంట్లు, విదేశీ లీగ్ లు ఆడి, ఫామ్ లో ఉండేందుకు ప్రయత్నించాలి. ఖాళీగా ఉండకూడదు. బోర్డు పిలిచినప్పుడు అందుబాటులో ఉండాలి.
ఇప్పుడు బీసీసీఐ ఏం చేసిందంటే, భారత జట్టుకు వీరిద్దరి అవసరం లేదన్నట్టు చేసింది. ఈ నేపథ్యంలో 2024-25 కాలంలో జరిగే భారత్ సిరీస్ ల్లో వీరిద్దరూ ఆడేది అనుమానంగానే మారింది. ముఖ్యంగా జూన్ లో ప్రారంభమయ్యే టీ 20 వరల్డ్ కప్ లో ఆడేది కష్టమేనని అంటున్నారు. రేపు వీరు ఐపీఎల్ లో అద్భుతాలు సృష్టిస్తే, ఏమైనా బీసీసీఐ నుంచి పిలుపు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.Read
ఇక శ్రేయాస్ అయ్యర్ కి ఎన్నో అవకాశాలు వచ్చాయి. రోహిత్ కి ఇష్టం లేకుండా అన్ని అవకాశాలు కష్టమేనని చెప్పాలి. అందువల్ల అది కరెక్టు కాదని కొందరు వ్యాక్యానిస్తున్నారు. మరొక అపవాదేమిటంటే గుజరాత్ కి చెందిన హార్దిక్ పాండ్యాకి రెస్ట్ ఇస్తూనే గ్రేడ్ ఏ లోకి తీసుకున్నారు. గుజరాత్ వారిపై మోదీకి, జైషాకి ఉన్న ప్రేమే అందుక్కారణమని అంటున్నారు. అయితే కావచ్చు కానీ హార్దిక్ పాండ్యా ఆటతీరుని తప్పు పట్టడానికి లేదు.
జట్టు విజయం కోసం శాయశక్తులా శ్రమిస్తాడు. గాయపడుతున్నా ఒక సైనికుడిలా పోరాడుతూనే ఉంటాడు. అందువల్ల పాండ్యాకి రికమండేషన్లు అవసరం లేదని సీనియర్లు వ్యాక్యానిస్తున్నారు. మొత్తానికి బీసీసీఐపై మళ్లీ విమర్శలు చెలరేగాయి. అవి ఇప్పుడప్పుడే ఆరేలా లేవు.