Rajinikanth new movie update(Tollywood movies news): సూపర్ స్టార్ రజనీకాంత్ గతేడాది ‘జైలర్’ మూవీతో తమ అభిమానుల ఆకలి తీర్చాడు. అప్పటి వరకు ఒక్క హిట్టు కూడా రజనీకాంత్కు లేకపోవడంతో ఆయనతో పాటు రజనీ అభిమానులు కూడా నిరుత్సాహంలో ఉన్నారు. కానీ జైలర్ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో వారిలో సరికొత్త ఉత్సాహం వచ్చింది.
ఇక అదే జోష్లో రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో లాల్ సలాం మూవీ చేశారు. అయితే ఇందులో ఆయన ప్రధాన పాత్రలో కాకుండా గెస్ట్ రోల్లో నటించారు. కానీ ఈ సినిమాలో ఆయన రోల్ మాత్రం చాలా పవర్ ఫుల్గా చూపించారు. అయినప్పటికీ ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది.
అంతేకాకుండా రజనీకాంత్ ఇమేజ్కు కూడా కాస్త దెబ్బతీసింది. ఈ మూవీపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ మూవీలో రజనీకాంత్ కేవలం 40 నిమిషాలు మాత్రమే కనిపించాడు. ఈ 40 నిమిషాలకు రజనీకాంత్ దాదాపు రూ.40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.
READ MORE: పాయల్ రాజ్పుత్ ‘మంగళవారం’ మూవీ అరుదైన రికార్డ్.. ఏ హీరోకి ఇది సాధ్యం కాదు..!
ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత రజనీకాంత్ ఎలాంటి స్టోరీతో రాబోతున్నాడు అనే ఆసక్తి అటు ప్రేక్షకుల్లోనూ, ఇటు అభిమానుల్లోనూ ఉంది. అలా ఎదురుచూసే వాళ్లకి తాజాగా ఓ గుడ్న్యూస్ అందింది. రజనీకాంత్ తన తదుపరి సినిమాను పాన్ ఇండియా రేంజ్లో చేస్తున్నట్లు తెలుస్తోంది.
రజనీకాంత్ – ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్వాలా కలిసి ఓ భారీ మూవీకోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తాజాగా నిర్మాత సాజిద్ తెలిపారు. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్తో కలిసి ఒక ఫీచర్ ఫిల్మ్ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు సాజిద్ తెలిపారు.
ఈ మేరకు ‘‘లెజండరీ రజనీకాంత్ సార్తో కలిసి పనిచేయడం నిజమైన గౌరవం!. మేము కలిసి ఈ మరపురాని ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాము’’ అంటూ తెలిపారు. అయితే దీనికి సంబంధించిన వివారాలను మాత్రం గోప్యంగా ఉంచారు.
తాజా సమాచారం ప్రకారం.. వీరి కాంబోలో రాబోతున్న ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో రాబోతున్నట్లు సమాచారం.