Magunta Sreenivasulu Reddy Resigned to YCP(Andhra politics news): వైసీపీకి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గుడ్ బై చెప్పారు. అనివార్య కారణాల వలన వైసీపీని వీడుతున్నట్లు తెలిపారు. ప్రస్థతం మాగుంట ఒంగోలు ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని స్పష్టం చేశారు.
ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన రాజీనామా విషయాన్ని ప్రకటించారు. 33 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని 11 సార్లు చట్టసభలకు పోటీ చేశానని తెలిపారు. ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్ అని స్పష్టం చేశారు. తమకు అహం లేదని.. ఆత్మాభిమానం మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఐదేళ్లు సహాయసహకారలందించిన సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మాంగుట రాజీనామాతో వైసీపీని వీడిన ఎంపీల సంఖ్య ఆరుకు చేరింది. ఐదుగురు లోక్ సభ ఎంపీలు కాగా.. ఒకరు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజీనామా చేసిన వారిలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఉన్నారు.