TS Inter Exams(Today news in telangana): తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని.. అధికారులు చెప్పేయడంతో విద్యార్థులు కాస్త ముందుగానే వెళ్లిపోయారు. జంబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తుండటంతో.. దూరంగా ఉండే పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకున్నారు.
ప్రథమ, ద్వితీయ ఏడాదికి సంబంధించి 9లక్షల 80 వేల 978 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. రాష్ట్రం వ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాద్లోనే 242 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశారు. ఒక గదిలో 25 మంది చొప్పున విద్యార్థులను కేటాయించనున్నారు.
4 లక్షల 78వేల 718 మంది విద్యార్థులు.. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయనున్నారు. 5 లక్షల 2 వేల 260 మంది..సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. పరీక్ష రాసేందుకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు కూడా అందుబాటులో ఉంచారు.
కాగా ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇక సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకు జరగనున్నాయి.