EPAPER

TS Inter Exams: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..

TS Inter Exams: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..

TS Inter ExamsTS Inter Exams(Today news in telangana): తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని.. అధికారులు చెప్పేయడంతో విద్యార్థులు కాస్త ముందుగానే వెళ్లిపోయారు. జంబ్లింగ్‌ విధానంలో పరీక్షలు నిర్వహిస్తుండటంతో.. దూరంగా ఉండే పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకున్నారు.


ప్రథమ, ద్వితీయ ఏడాదికి సంబంధించి 9లక్షల 80 వేల 978 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. రాష్ట్రం వ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే 242 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశారు. ఒక గదిలో 25 మంది చొప్పున విద్యార్థులను కేటాయించనున్నారు.

Read More: CUET-UG 2024: కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..


4 లక్షల 78వేల 718 మంది విద్యార్థులు.. ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు రాయనున్నారు. 5 లక్షల 2 వేల 260 మంది..సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్‌ రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. పరీక్ష రాసేందుకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు కూడా అందుబాటులో ఉంచారు.

కాగా ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇక సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకు జరగనున్నాయి.

Tags

Related News

Balapur Laddu: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Rajiv Gandhi: ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోడానికే ఆ ఖాళీ ప్లేస్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Telangana Liberation Day: విమోచన దినోత్సవంగా నిర్వహిస్తేనే హాజరవుతా: కేంద్రమంత్రి బండి

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

Nursing student death: గచ్చిబౌలి హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి.. రూమంతా రక్తం, హత్యా.. ఆత్మహత్యా?

Harish Rao: హరీశ్ రావు యాక్ష‌న్ షురూ.. కేసీఆర్ శకం క్లోజ్ అయినట్లేనా?

Big Stories

×