Nigerian death in Delhi: దేశరాజధాని ఢిల్లోలోని బురారీ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఫిబ్రవరి 23న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల ప్రాథమిక విచారణలో మరణానికి గల కారణం అగ్నిప్రమాదమని తెలిసింది. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేప్పట్టారు.
మృతుల్లో ఒకరిని నైజీరియాకు చెందిన క్రిస్టియన్ ఇఫెనిచుక్వుగా గుర్తించారు. మరోవ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 23న ఇద్దరు వ్యక్తులు కాలిన గాయాలతో ఎయిమ్స్లో చేరారు. వీరిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తమ స్నేహితులము అంటూ ఆసుపత్రిలో చేర్పించారు.
Read More: కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..
బాధితులను ఆసుపత్రిలో చేర్పించిన అనంతరం ఆ వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. చికిత్స పొందుతు మంగళవారం ఈ ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతి చెందిన వ్యక్తుల్లో ఒకరు నైజీరియాన్ వ్యక్తి కాగా మరోకరు వివరాలు తెలియాల్సి ఉంది.
విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థాలనికి చేరుకుని దర్యాప్తు చేప్పట్టారు. సంఘటనా స్థలంలో ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించారు. పోలీసుల ప్రథమిక విచారణలో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.