Encounter in Chhattisgarh: దండకారణ్యం నెత్తురోడుతుంది. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలో జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకు, మావోయిస్టులకు ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ , సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా వారికి మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాలు కాల్పుల జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోగా పలువురు తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన ప్రదేశం నుంచి మావోయిస్టుల మృతదేహాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
సోమవారం 8 లక్షల రివార్డు కలిగిన మావోయిస్టు లొంగిపోయాడు. అ తర్వాత ఈ ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. కాగా ఇటీవలె సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. దీంట్లో ఇక మావోయిస్టు మృతిచెందాడు.
అటు ఆదివారం కాంకేర్ జిల్లా అటవీ ప్రాంతంలో డీఆర్జీ బలగాలకు మావోల మధ్య ఎదురుకాల్పులు జరగడంతో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. దీంతో దండకారణ్యం తుపాకీ మోతలతో దద్దరిల్లుతోంది.