EPAPER

PM visit to Kerala: కేరళలో ప్రధాని పర్యటన.. రూ. 4,000 కోట్లతో ప్రాజెక్టులు ప్రారంభం..

PM visit to Kerala: కేరళలో ప్రధాని పర్యటన.. రూ. 4,000 కోట్లతో ప్రాజెక్టులు ప్రారంభం..

Prime Ministers visit to Kerala


Prime Ministers visit to Kerala: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. ఆయన కేరళతో పాటు తమిళనాడులో పర్యటించనున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  కేరళలోని కొచ్చిలో రూ. 4,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులలో కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ వద్ద 310-మీటర్ల పొడవు గల న్యూ డ్రై డాక్ ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీ, పుతువైపీన్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇంపోర్ట్ టెర్మినల్ ఉన్నాయి.


ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ రోజు, భారతదేశం ప్రపంచ వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా మారుతున్నప్పుడు, దేశ సముద్ర బలాన్ని పెంచడంపై దృష్టి పెడుతున్నామన్నారు. ఈ ప్రాజెక్టులు దేశంలోని దక్షిణ ప్రాంత అభివృద్ధిని వేగవంతం చేయడానికి సహాయపడతాయని ఆయన అన్నారు.

దీంతో తిరువనంతపురం పోలీసులు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయి. అంతర్జాతీయ టెర్మినల్‌కు వెళ్లే వారు వెంపాలవట్టం, చక్కా ఫ్లై ఓవర్, ఈంచక్కల్ వద్ద ఉన్న అనంతపురి హాస్పిటల్ సర్వీస్ రోడ్డు మీదుగా వెళ్లాలని తెలిపారు.

 

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×