EPAPER

Rajya sabha election 2024: 15 రాజ్యసభ స్థానాలకు పోలింగ్‌.. విపక్షాలకు క్రాస్‌ ఓటింగ్‌ భయం

Rajya sabha election 2024: 15 రాజ్యసభ స్థానాలకు పోలింగ్‌.. విపక్షాలకు క్రాస్‌ ఓటింగ్‌ భయం

Rajya sabha election for 15 seats


Rajya sabha election for 15 seats: సార్వత్రిక ఎన్నికలకు ముందు మూడు రాష్ట్రాల్లోని 15 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. 56 స్థానాలకు గాను ఇప్పటికే 41 మంది నేతలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో 10, హిమాచల్‌ ప్రదేశ్‌లో 1, కర్ణాటకలో 4 మొత్తం 15 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, అశోక్ చవాన్, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ఎల్ మురుగన్ మొదలైన వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


ఉత్తరప్రదేశ్‌లోని 10 రాజ్యసభ స్థానాలకు బీజేపీ ఎనిమిది మంది అభ్యర్థులను, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ ముగ్గురిని బరిలోకి దింపడంతో ఒక సీటుపై గట్టి పోటీకి జరగనుంది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు పేర్కొన్నారు.

Read More: మెట్రోలో రైతుకు నో ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో

కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్, మాజీ ఎంపీ చౌదరి తేజ్వీర్ సింగ్, సీనియర్ రాష్ట్ర నాయకుడు అమర్‌పాల్ మౌర్య, మాజీ మంత్రి సంగీత బల్వంత్ (బైంద్) పార్టీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది, మాజీ ఎమ్మెల్యే సాధనా సింగ్, ఆగ్రా మాజీ మేయర్ నవీన్ జైన్‌లను బీజేపీ బరిలోకి దింపింది.

సమాజ్‌ వాదీ పార్టీ నుంచి ఎంపీ జయాబచ్చన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అలోక్ రంజన్, దళిత నేత రామ్‌జీ లాల్ సుమన్‌లను రంగంలోకి దింపింది. మరోవైపు కర్ణాటకలో, అధికార కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను సోమవారం ఒక ప్రైవేట్ హోటల్‌కు తరలించింది. పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసే అవకాశం లేదని రాష్ట్ర పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కొట్టిపారేశారు.

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×