Staff Refused Farmer in Metro In Bangalore: దుస్తులు మురికిగా ఉన్నాయని మెట్రోలో ప్రయాణించేందుకు ఓ రైతును మెట్రో సెక్యూరిటీ నిరాకరించింది. బెంగళూరులో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగ వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ వీడియో ట్వీట్టర్లో చక్కర్లు కొడుతుంది. ఇదీ చూసిన కొందరు రైతుకు మద్దతు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.
ఫిబ్రవరి 18న ఓ రైతు తెల్ల చొక్క, తలపై బట్టల సంచితో ప్రయాణానికి మెట్రోలో టికెట్ కొనుగోయి చేశారు. బెంగళూరులోని రాజాజీనగర్ మెట్రో స్టేషన్ సెక్యూరిటీ చెక్ పోస్టు వద్ద ఆపి ఆ రైతు బట్టలు మురికిగా ఉన్నాయని మెట్రోలో ప్రయాణించేందుకు అనుమతి నిరాకరించారు.
UNBELIEVABLE..! Is metro only for VIPs? Is there a dress code to use Metro?
I appreciate actions of Karthik C Airani, who fought for the right of a farmer at Rajajinagar metro station. We need more such heroes everywhere. @OfficialBMRCL train your officials properly. #metro pic.twitter.com/7SAZdlgAEH— Deepak N (@DeepakN172) February 24, 2024
Read More: ఓటుకు ఆధార్ తప్పనిసరి కాదు.. కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ..
దీంతో అక్కడే ఉన్న మరో వ్యక్తి రైతుకు మద్దతుగా వచ్చారు. మెట్రో సేవలను పొందాలంటే టికెట్ ఉంటే సరిపోదా.. డ్రెస్ కోడ్ పాటించాలనే నిబంధన ఉందా అని అధికారులను ప్రశ్నించారు. ఏ కారణం చేత మీరు ప్రవేశం నిరాకరిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెట్రో ఎమైన వీఐపీలకు మాత్రమే నా అని నిలదీశారు. అతనితో పాటు అక్కడున్న మరికొందరు కూడా రైతుకు మద్దతుగా వచ్చి మెట్రో సిబ్బందిపై మండిపడ్డారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఉన్నతాధికారులు ఆ మెట్రో సెక్యూరిటీ సూపర్ వైజర్ను విధులనుంచి తొలగించారు.