Egypt 19 Dead After Boat Capsizes On Nile: ఈజిప్టు రాజధాని కైరో శివార్లలోని నైలు నదిలో కూలీలను తీసుకెళ్తున్న ఓ ఫెర్రీ బోటు మునిగి పోయంది. ఈ ప్రమాదం గ్రేటర్ కైరాలో భాగమైన గిజాలోని మోన్షాత్ ఎల్ కాంటేర్ పట్టణంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 19 మంది దాకా మృతి చెందినట్లు తెలుస్తోంది. కూలీలంతా ఒక భవన నిర్మాణ సైట్ లో పనికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. పడవ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.
ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయట పడిన వారిని వైద్య సహాయం కోసం ఆసుపత్రికి తరలించి, చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణించిన ప్రతి కుటుంబానికి 2 లక్షల ఈజిప్టియన్ పౌండ్లు, గాయపడిన వారికి 20 వేల పౌండ్ల నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
Read more: చిన్న వయసులో పెళ్లి ఏంట్రా, వైరల్ అవుతున్న వీడియో
అప్సర్ ఈజిప్టులోని నైలు నది డెల్టాలోని ప్రజలు రోజువారి పనుల కోసం ఫెర్రీ బోట్లలో ప్రయాణిస్తుంటారు. నిర్వహణ లోపం వల్లన ఇక్కడ తరుచూ బోటు, రైలు, రోడ్డు, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. గతంలో కూడా నైలు నదిలో బోటు ప్రమాదం జరిగి చాలా మంది మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.