Radisson Drugs Case Update: రాడిసన్ డ్రగ్స్ కేసు అంశం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో పలువురు సెలబ్రిటీలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సినీనటి లిషిగణేష్, శ్వేతాపై కేసు నమోదు చేశారు. డ్రగ్స్ పార్టీకి లిషిగణేష్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో కూడా లిపి గణేష్తో, ఆమె సోదరి డ్రగ్స్ వాడారనే ఆరోపణలు ఉన్నాయి.
మొత్తం పది మంది వీఐపీలపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇద్దరు అమ్మాయితో పాటు తొమ్మిది మందిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. గజ్జల వివేకానంద్, అబ్బాస్ అనే వ్యాపారస్తులపై కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. నిర్భయతో పాటు రఘు చరణ్ అనే వ్యక్తి డ్రగ్స్ సేవించినట్టు పోలీసలు గుర్తించారు. కొకైన్ పేపర్ రోల్లో చేసి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
Read More : మెట్రోలో సీటు కోసం ఫీట్లు.. ప్రయాణికులు ఏం చేస్తున్నారో తెలుసా ?
ఇక ఈ కేసులో పట్టుబడిన నిందితులకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై నిందితులు కేదార్ నాథ్, నిర్బయ్ విడుదలయ్యారు. మొత్తం ముగ్గురు పూచికత్తులు సమర్పించడంతో కేదార్ నాథ్, నిర్భయ్ బెయిల్ పై బయటకు వచ్చారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో ఆదివారం అర్థరాత్రి గజ్జల వివేకానంద్ తన స్నేహితులకు ఇచ్చిన పార్టీలో విచ్చలవిడిగా డ్రగ్స్ వాడినట్లు పోలీసులు తెలిపారు.