Anant Ambani pre-wedding ceremony: ముకేశ్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల వివాహం జులైలో జరగనుంది. ఈ సందర్భంగా మార్చి 1 నుంచి 3 వరకు ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు గుజరాత్లోని జామ్నగర్ వేదికైంది. ఈ వేడుకకు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలతో పాటు ప్రపంచ ప్రముఖులు ఇక్కడకి చేరుకుంటారు.
ఇందులో భాగంగానే ప్రముఖ గ్లోబల్ పాప్-స్టార్ రిహన్న మొట్టమొదటి సారి భారత్ రానున్నారు. భారతదేశంలోని గొప్ప సాంస్కృతిక వారసత్వం, వైభవాన్ని ప్రతిబింబించే విస్తృతమైన అలంకరణలు, సంగీతం, నృత్య ప్రదర్శనలతో పాటు రుచికరమైన వంటకాలు ఉంటాయి.
అంబానీలు జామ్నగర్లో జరిగే గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ను పర్యాటక వేదికగా కాకుండా తమ నివాసంలో జరుపుకోనుండటం ప్రత్యేకం. షారూఖ్ ఖాన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి ప్రముఖుల నుంచి సిద్ధార్థ్ మల్హోత్రా, సైఫ్ అలీఖాన్ తదితరుల వరకు గుజరాత్లో జరిగే ఈ వేడుకలకు హాజరుకానున్నారు.
Read More: ప్రభుత్వ జోక్యం లేని సమాజాన్ని సృష్టించడమే లక్ష్యం: ప్రధాని మోదీ
ఈ వేడుకలు మూడు రోజుల పాటు సాగుతున్నాయి. అనంత్ రాధికల వేడుకకు సంగీతం, నృత్య ప్రదర్శనలతో పాటు కార్నివాల్ సరదా కార్యాచరణలు, దృశ్య కళాత్మకత కూడా ఉంటుంది. గ్లోబల్ పాప్ ఐకాన్ రిహన్నా ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలో ప్రదర్శన ఇవ్వనున్నట్లు సమాచారం.
ఈ వేడుకలు జామ్నగర్లో గత కొన్ని దశాబ్దాలుగా చేసిన ప్రకృతి పరిరక్షణ అనుభవాన్ని అతిథులకు అందిస్తాయి. అంతే కాదు, అనంత్ అంబానీ నేతృత్వంలో జామ్నగర్లో జరుగుతున్న జంతు సంరక్షణ, వాటి పునరావాస పనులను కూడా ఇక్కడ చూడవచ్చు.
Read More: నీతి అయోగ్ రిపోర్ట్.. భారత్ లో తగ్గుతున్న పేదరికం.
ఇతర కార్యక్రమాలతో పాటు.. జామ్నగర్ టౌన్షిప్ టెంపుల్ కాంప్లెక్స్లో జరిగే సాంప్రదాయ ‘హస్తక్షర్’ వేడుకను కూడా అంబానీ కుటుంబం ఏర్పాట్లు చేసింది. ఈ అంశాలతో పాటు, వివాహ ఆహ్వాన పత్రికలో వేడుకలు, ఆతిథ్యం కోసం సెట్ చేసిన మూడ్ బోర్డుల వివరాలు కూడా ఉన్నాయి. బిల్ గేట్స్, మెలిండా గేట్స్తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యే ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్లకు 1,000 మంది అతిథులు ఆహ్వానించారు.