DA Hike Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 2024 మార్చిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డియర్నెస్ అలవెన్స్లో 4% పెంపుదల పొందే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి.
సాధారణంగా కేంద్ర ప్రభుత్వం.. ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్(DA), పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (DR) ఇస్తుంది. DA సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తారు. జనవరిలో ఒకసారి, జులైలో ఒకసారి డీఏ పెంపు ఉంటుంది. తాజా డీఏ పెంపుపై ప్రకటన మార్చి 2024లో వెలువడే అవకాశం ఉంది. ఈ పెంపుతో ప్రస్థుతం 46 శాతంగా ఉన్న డీఏ 50 శాతానికి పెరగనుంది.
డీఏ, డీఆర్ అంటే ఏమిటి..?
ద్రవ్యోల్బణం ప్రభావం వలన పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ ప్రకటిస్తుంది. ప్రతి సంవత్సరం రెండు సార్లు.. జనవరి, జులైలో డీఏను కేంద్ర ప్రభుత్వం సవరిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గతేడాది జులైలో డీఎ ప్రకటించింది. అటు పెన్షనర్లకు కూడా ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ ఉండకూడదని డియర్నెస్ రిలీఫ్ను ప్రకటిస్తుంది. సాధారణంగా డీఏ, డీఆర్ను ఒకే సారి కేంద్రం ప్రకటిస్తుంది.
అటు హోళీ పండుగకు ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విషయంలో శుభవార్త చెప్పే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరుగుతాయి.