EPAPER

Ashok Veeraraghavan: అమెరికాలో ఎన్నారై కు ప్రతిష్ఠాత్మక అవార్డు.. ప్రకటించిన ది టెక్సాస్ అకాడమి ఆఫ్ మెడిసిన్

Ashok Veeraraghavan: అమెరికాలో ఎన్నారై కు ప్రతిష్ఠాత్మక అవార్డు.. ప్రకటించిన ది టెక్సాస్ అకాడమి ఆఫ్ మెడిసిన్
Ashok Veeraraghavan
Ashok Veeraraghavan

Ashok Veeraraghavan: ఇమేజింగ్ సాంకేతికతతో విప్లవాత్మక పరిశోధనలు చేసిన.. భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త అశోక్ వీరరాఘవన్ కు ఇంజినీరింగ్ విభాగంలో ప్రతిష్ఠాత్మక ఈడిత్ అండ్ పీటర్ ఓ డానల్ (Edith and Peter O’Donnell Award) అవార్డు దక్కింది. ఈ అవార్డును టెక్సాస్ రాష్ట్ర అత్యున్నత అవార్డుల్లో ఒకటిగా భావిస్తారు. ది టెక్సాస్ అకాడమి ఆఫ్ మెడిసిన్, ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ దీనిని అశోక్ వీరరాఘవన్ కు ప్రకటించింది. చెన్నైలో పుట్టిపెరిగిన ఆయన.. ప్రస్తుతం రైస్ యూనివర్సిటీలోని జార్జ్ ఆర్ బ్రౌన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ గా ఉన్నారు.


వీరరాఘవన్ తన బృందంతో కలిసి ఇమేజింగ్ టెక్నాలజీలో విప్లవాత్మక పరిశోధనలు చేశారు. ఆప్టిక్స్ నుంచి సెన్సార్ డిజైన్ వరకూ మెషిన్ ఆల్గొరిథమ్ సాంకేతికతో ఇమేజింగ్ రంగంలో వివిధ సవాళ్లను అధిగమించారు. వాటన్నింటిపై సమీకృత విధానంలో పరిశోధన చేస్తున్నట్లు ప్రొఫెసర్ వీరరాఘవన్ తెలిపారు. ఇప్పుడున్న సాంకేతికతో చూడటం సాధ్యం కాని వాటిని కూడా కనిపించేలా చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.


Related News

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Nigeria boat accident : నైజీరియాలో బోటు ప్రమాదం..64 మంది మృతి

Sunita williams: అంతరిక్ష కేంద్రం నుంచి ఓటేస్తానంటున్న సునీతా విలియమ్స్

US Teacher Student Relation| 16 ఏళ్ల అబ్బాయితో టీచర్ వివాహేతర సంబంధం.. విద్యార్థి తండ్రి తెలుసుకొని ఏం చేశాడంటే?..

Big Stories

×