Janasena Seat Share with TDP(Political news in AP): టీడీపీతో పొత్తుకు సిద్ధమైన జనసేన 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది. మూడు ఎంపీ సీట్ల పరిధిలోని 21 స్థానాలనూ లెక్కలోకి తీసుకుంటే.. మొత్తంగా 45 సీట్లలో జనసేన ప్రభావం ఉండనుంది. ఇప్పటికే తెనాలి, అనకాపల్లి, నెల్లిమర్ల, కాకినాడ రూరల్, రాజానగరంలో పోటీచేసే తమ అభ్యర్థుల పేర్లను జనసేనాని ప్రకటించగా, మిగిలిన 18 స్థానాల మీదా పార్టీ ఒక స్పష్టతకు వచ్చినట్లు సమాచారం.
వీటిలో పిఠాపురం, అమలాపురం, భీమవరం, నరసాపురం, నిడదవోలు, పోలవరం, విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, యలమంచిలి, పాలకొండ జనసేనకు ఖరారైనట్లు వినవస్తోంది. వీటికి తోడు గిద్దలూరు, అనంతపురం లేదా పుట్టపర్తి, మదనపల్లె, బద్వేలు లేదా రైల్వే కోడూరు అసెంబ్లీ సీట్లను కోరేందుకు జనసేన సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Read More : వారం వారం సర్వే.. తేడా వస్తే అభ్యర్థులను మార్చేస్తా.. చంద్రబాబు వార్నింగ్..
ఇక.. లోక్సభ విషయానికొస్తే.. బందరు, కాకినాడ, అనకాపల్లిలో జనసేన పోటీ చేయనుంది. వీటిలో అనకాపల్లి నుంచి మెగా బ్రదర్ నాగబాబు జరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. బీజేపీతో చర్చలు కొలిక్కి రాగానే రెండవ జాబితా రూపంలో సీట్లను ప్రకటించేందుకు జనసేన సిద్ధమవుతున్నట్లు సమాచారం.