Telangana Youth Died in US(TS news updates): విదేశాల్లో ఉన్నత చదువులు చదివి.. ఉద్యోగం సాధించాలని అతను కన్న కలలన్నీ ఆవిరయ్యాయి. తల్లిదండ్రులు కొడుకును ఉన్నత శిఖరాలపై చూడాలనుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. వారి కలలు తీరకుండానే బ్రెయిన్ స్ట్రోక్ రూపంలో మృత్యువు కబళించింది. సికింద్రాబాద్ తిరుమలగిరికి చెందిన రిటైర్డ్ ఆర్టీఓ తులసీరాజన్ పెద్దకొడుకు బండా రుత్విక్ రాజన్ (30) రెండేళ్ల క్రితం ఉన్నత చదువులకై అమెరికా వెళ్లాడు.
Read More : ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి..
అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో ఇటీవలే ఎంఎస్ పూర్తిచేసి పట్టా పొందాడు. ఉద్యోగ అన్వేషణలో ఉన్న అతను.. స్నేహితులతో కలిసి భోజనం చేస్తుండగా ఉన్నట్టుండి కిందపడ్డాడు. స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించాడని, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా చనిపోయాడని తెలిపారు. కుమారుడి మరణంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆదివారం రాత్రి రుత్విక్ మృతదేహం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా.. కొడుకును చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.