EPAPER

9 People died in Bihar Road Accident: బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి

9 People died in Bihar Road Accident: బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి
Bihar Road accident
Bihar Road accident

9 People died in Bihar Road Accident: బిహార్‌లోని కైమూర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం ట్రక్కు, జీపు, మోటార్‌సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది వ్యక్తులు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వేగంగా వస్తున్న జీప్ మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది, రెండు వాహనాలు ఎదురుగా వస్తోన్న ట్రక్కును ఢీకొనడంతో తొమ్మిది మంది మృతి చెందారు.


“ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ఇద్దరు మహిళలతో సహా ఎనిమిది మందితో కూడిన జీపు.. మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. జీప్‌పై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో ఢీకొన్నట్లు తెలుస్తోంది” అని మోహానియా డీఎస్పీ దిలీప్‌కుమార్ తెలిపారు.

కాగా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు అవసరమైన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.


Read More: Nafe Singh Rathi: హర్యానా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ప్రెసిడెంట్ దారుణ హత్య..

“కైమూర్‌లోని మోహానియా సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం తన తీవ్ర వేదనను వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు” అని సీఎం కార్యాలయం ఆదివారం అర్థరాత్రి ప్రకటన విడుదల చేసింది.

Tags

Related News

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

Threat to Rahul Gandhi: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..

Atishi Marlena Singh: ఒకప్పటి ఆంధ్రా స్కూల్ టీచర్ ఇప్పుడు ఢిల్లీ సిఎం.. ఆతిషి రాజకీయ ప్రస్థానం

Jammu Kashmir Elections: జమ్మూ‌కాశ్మీర్‌లో మొదలైన పోలింగ్.. ఓటర్లు క్యూ లైన్.. పదేళ్ల తర్వాత, పార్టీలకు పరీక్ష

Big Stories

×