9 People died in Bihar Road Accident: బిహార్లోని కైమూర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం ట్రక్కు, జీపు, మోటార్సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది వ్యక్తులు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వేగంగా వస్తున్న జీప్ మోటార్సైకిల్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది, రెండు వాహనాలు ఎదురుగా వస్తోన్న ట్రక్కును ఢీకొనడంతో తొమ్మిది మంది మృతి చెందారు.
“ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ఇద్దరు మహిళలతో సహా ఎనిమిది మందితో కూడిన జీపు.. మోటార్సైకిల్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. జీప్పై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఢీకొన్నట్లు తెలుస్తోంది” అని మోహానియా డీఎస్పీ దిలీప్కుమార్ తెలిపారు.
కాగా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు అవసరమైన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Read More: Nafe Singh Rathi: హర్యానా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ప్రెసిడెంట్ దారుణ హత్య..
“కైమూర్లోని మోహానియా సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం తన తీవ్ర వేదనను వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు” అని సీఎం కార్యాలయం ఆదివారం అర్థరాత్రి ప్రకటన విడుదల చేసింది.