Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ పరిణామాల మధ్య ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 1,061 పాయింట్ల లాభంతో 61,673 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 298 పాయింట్లు లాభపడి 18,326 వద్ద ట్రేడవుతోంది.
టీసీఎస్, టాటాస్టీల్, భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్, హీరోమోటో కార్ప్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బలహీనత సెంటిమెంట్పై ఒత్తిడిని పెంచింది. ముఖ్యంగా ఆటో, ఫైనాన్స్, ఇంధన షేర్లలో భారీగా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ట్రేడింగ్ నష్టాలను భర్తీ చేసుకున్న రూపాయి ఏడు పైసలు స్వల్పంగా బలపడి 81.40 వద్ద స్థిరపడింది.