A Train Without A Driver: డ్రైవర్ లేకుండానే ఓ గూడ్స్ రైలు 84 కిలోమీటర్లు ప్రయాణించింది. జమ్ముకశ్మీర్లోని కథువాలో ఆదివారం ఈ అసాధారణ ఘటన చోటుచేసుకుంది. చివరకు పంజాబ్లోని ముక్రెయిన్ జిల్లాలో ఆ రైలు ఆగింది.
కథువా స్టేషన్లో సిబ్బంది మారేందుకు రైలును నిలిపారు. కాంక్రీట్ను తీసుకెళ్తున్న ఆ గూడ్స్ రైలు.. పల్లపు ప్రాంతం కావడంతో పఠాన్ కోట్ దిశగా కదిలింది. ఆ సమయంలో ఇంజన్ ఆన్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. డ్రైవర్, కో-డ్రైవర్ రైలు దిగే ముందు హ్యాండ్ బ్రేక్ కూడా వేయడం విస్మరించారు.
Read More: మోదీ స్కూబా డైవింగ్.. ద్వారక సందర్శన
అయితే ఆ ట్రాక్పై మరే ఇతర రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తినష్టం ఏదీ సంభవించలేదు. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.