SAMSUNG Galaxy S23 FE 5G @ Rs 42,499: ప్రస్తుతం మార్కెట్లోకి హై రేటెడ్ స్మార్ట్ఫోన్లు వస్తున్నాయి. అద్భుతమైన ఫీచర్లు, అప్డేటెడ్ వెర్షన్లతో కొత్త కొత్త మోడళ్లు ఫోన్ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలు తమ మోడళ్లలో సరికొత్త వెర్షన్లతో ఆకట్టుకున్నాయి. అందులో ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ సామ్సంగ్ ఒకటి.
ఈ కంపెనీ నుంచి ఇప్పటికే చాలా మోడళ్లు వచ్చి అందరినీ ఆకట్టుకున్నాయి. అందులో ‘సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఈ 5జీ’ (SAMSUNG Galaxy S23 FE 5G) ఒకటి. ఈ ప్రీమియం స్మార్ట్ఫోన్ డిజైన్, అదిరిపోయే కెమెరా నాణ్యత సహా అనేక అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది.
ప్రస్తుతం ఈ ప్రీమియం స్మార్ట్ఫోన్పై ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్లో కళ్లుచెదిరే డిస్కౌంట్ ఆఫర్ పొందొచ్చు. ఈ మొబైల్ అసలు ధరను రూ.79,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఇప్పుడు దీనిపై అమెజాన్ బంపరాఫర్ అందిస్తోంది. దాదాపు 43 శాతం డిస్కౌంట్ అందిస్తోంది.
Read More: త్వరలో మార్కెట్లోకి వివో వి30 అండ్ వివో వి30 ప్రో.. ధర, స్పెషిఫికేషన్స్ ఇవే..!
ఈ డిస్కౌంట్తో ‘సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఈ 5జీ’ స్మార్ట్ఫోన్ కేవలం రూ.45,499కే లభిస్తుంది. అందువల్ల భారీ డిస్కౌంట్ ఆఫర్ కోసం ఎదురుచూస్తున్న ఫోన్ ప్రియులకు ఇదొక చక్కటి అవకాశమనే చెప్పాలి.
ఇకపోతే ఈ డిస్కౌంట్తో పాటు ఈ మొబైల్పై పలు బ్యాంక్ ఆఫర్లు, క్యాష్బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ ప్రీమియం స్మార్ట్ఫోన్ను కస్టమర్లు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ద్వారా నెలవారీ రూ.2,206 చెల్లించి కొనుగోలు చేసుకోవచ్చు. దీని ద్వారా ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు.
అలాగే ఈ స్మార్ట్ఫోన్ను ఎంపిక చేసిన డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1500 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా జీఎస్టీ ఇన్వాయిస్తో చేస్తే వ్యాపార కొనుగోళ్లపై అదనంగా 28శాతం ఆదా చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ ఆఫర్స్ MINT 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్కు అందుబాటులో ఉంది.