PM Modi Gujarat Tour Highlights : ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రిడ్జ్ ను ప్రారంభించారు. గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో ఈ తీగల వంతెనను నిర్మించారు. ఈ బ్రిడ్జి పొడవు 2.3 కిలోమీటర్లు. ఈ వంతెన నిర్మాణానికి 979 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
Read More: రైతులకు కేంద్రం శుభవార్త.. అకౌంట్లో డబ్బులు పడేది ఆ రోజే..
దేశంలోనే అతిపొడవైన ఈ కేబుల్ బ్రిడ్జ్ కు సుదర్శన్ సేతు అని నామకరణం చేశారు. ఈ వంతెన నిర్మాణంతో ఓఖా ప్రాంతం.. బెట్ ద్వారకా తో అనుసంధానమైంది. 2017 అక్టోబర్ లో ప్రధాని మోదీ సుదర్శన్ సేతు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
4 వరుసలతో ఈ వంతెనను నిర్మించారు. బ్రిడ్జ్ వెడల్పు 27.20 మీటర్లు. ఇందులోనే ఫుట్పాత్ ను ఏర్పాటు చేశారు. పుట్ పాత్ వెడల్పు 2.5 మీటర్లు. వంతెనకు ఇరువైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలు పొందుపర్చారు. బ్రిడ్జిపై సోలార్ ప్యానళ్లు అమర్చారు. దీని ద్వారా మెగావాట్ విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు.
ప్రధాని గుజరాత్ పర్యటనలో ద్వారక ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా 5 ఎయిమ్స్ హాస్పిటళ్లను ప్రారంభించారు. అందులో ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి ఎయిమ్స్ కూడా ఉంది.