GOVERNOR : తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో భేటీ అయ్యారు. ఉమ్మడి నియామక బోర్డు బిల్లు ఆమోదంపై విద్యాశాఖ మంత్రి రాజ్భవన్కు వచ్చి చర్చించాలని గరవ్నర్ సూచించిన నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి తమిళ సైతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డుపై గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరణ ఇచ్చారు. ఉమ్మడి నియామక బోర్డుపై గవర్నర్ కు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. న్యాయపరమైన చిక్కులు రాకూడదనేదే తన విధానమని తమిళసై స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల్లో ఉమ్మడి నియామక బోర్డు ద్వారా నియామకాలు త్వరగా జరగాలన్నదే తన ఉద్దేశమని తెలిపారు. అయితే నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరణ ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవని గవర్నర్ కు స్పష్టం చేశారు.