Poacher @ Top 1 Trending: దర్శకుడు రిచీ మెహతా రూపొందించిన లేటెస్ట్ క్రైమ్ వెబ్ సిరీస్ ‘పోచర్’. ఫిబ్రవరి 23 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్ అద్భుతమైన రెస్పాన్స్ను అందుకుంటోంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఈ సిరీస్కి నిర్మాతగా వ్యవహరించి అద్భుతమైన హిట్ అందుకున్నారు. ఒక చిన్న సిరీస్గా హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చి అందరినీ ఆకట్టుకుంటోంది.
దీనిపై తాజాగా ఈ సిరీస్ నిర్మాత అలియా భట్ స్పందించారు. ఈ మేరకు తన ఇన్స్టా ద్వారా ఓ ఫొటో పంచుకుంది. పోచర్ వెబ్ సిరీస్ గురించి అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపింది.
Read More: ‘ఆర్టికల్ 370’ మూవీ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
ఈ మేరకు తన ఇంట్లోని టీవీ ముందు నిల్చొని పిల్లితో దిగిన ఫొటోను పంచుకుంది. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ రోజే భారతదేశంలో నంబర్వన్గా నిలవడం సంతోషంగా ఉందని ఇన్స్టాలో రాసుకొచ్చారు. కాగా ఇప్పటికి ఈ పోచర్ సిరీస్ ఓటీటీలో టాప్లో కొనసాగుతుండటం విశేషం.
నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దివ్యేంద్రు భట్టాచార్య ప్రధాన పాత్రలలో నటించిన ఈ సిరీస్ స్టోరీ 2015 నేపథ్యంలో నడుస్తూ ఉంటుంది. దంతాల కోసం 18 ఏనుగులను చంపేయడంతో.. ఎవరు చంపుతున్నారు?.
ఏనుగుల దంతాల రవాణా ఎక్కడి నుంచి ఎక్కడకి చేరుకుంటుంది..? దీన్ని నడిపిస్తున్నది ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం నిమిషా సజయన్ (మాల)తో పాటు ఓ టీమ్ రంగంలోకి దిగుతుంది. ఇక అక్కడ నుంచి అడవి మొత్తం వెతికే క్రమంలో ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది.