పీఎం కిసాన్ పథకానికి రైతులు మాత్రమే అర్హులు.
పీఎం కిసాన్ 16వ విడత ఎప్పుడు విడుదల చేస్తారంటే..
పీఎం కిసాన్ 16వ విడత ఫిబ్రవరి 28, 2024న కేంద్రం రైతులకు అందిస్తున్నట్లు తెలుస్తోంది.
పీఎం కిసాన్ 16 వ విడత డిపాజిట్ అయ్యిందా? లేదా? అని ఎలా చెక్ చేసుకోవాలంటే..
1. అర్హులైన రైతులు https://pmkisan.gov.in/portal పీఎం సమ్మాన్ నిధి అధికార పోర్టల్ లోకి వెళ్లాలి.
2. హోమ్ పేజీలో కార్నర్ ను ఎంపిక చేసుకోవాలి.
3. పీఎం కిసాన్ బెనిఫిసియరీ స్టేటస్ తనిఖీ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
4. ఆధార్ లేదా ఫోన్ నంబర్ లేదా అకౌంట్ నంబర్ సెలక్ట్ చేసుకోవాలి.
5. గెట్ డేటాపై క్లిక్ చేస్తే మీ స్టేటస్ స్క్రీన్ పై కనబడుతుంది.
Read More: అమెరికాలో జాబ్ వదిలేసి.. స్టార్టప్తో రూ.100 కోట్లు..!
పీఎం కిసాన్ వెబ్ సైట్ ప్రకారం.. ఈ పథకానికి నమోదు చేసుకునే రైతులు ఈ కేవైసీ ని తప్పని సరి చేసుకోవాలి. ఈ కేవైసీ పీఎం కిసాన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. లేదంటే కామన్ సర్వీస్ సెంటర్ కేంద్రాలలో బయోమెట్రిక్ ద్వారా కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు.
అంతే కాకుండా కేంద్రం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని నేరుగా రైతులకు అందించేల ఈకేవైసీని ప్రవేశపెట్టింది. ఇలా చేయడం వల్ల మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా కేంద్రం రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులను డిపాజిట్ చేస్తుంది.