Tense atmosphere between Iran and Pakistan: ఇరాన్ పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ భూభాగంలో ఇరాన్ మరోసారి సైనిక దాడిని నిర్వహించింది. ఇరాన్ సైనిక బలగాలు ప్రముఖ ‘జైష్ అల్ అదిల్’ మిలిటెంట్ గ్రూప్ కమాండర్ ఇస్మాయిల్ షాబక్ష్ పాకిస్తాన్ భూభాగంలో హత్య చేశారు. 2012లో ఏర్పాటైన ‘జైష్ అల్ అదిల్’ని ఉగ్రవాద సంస్థగా ఇరాన్ గుర్తించింది.
గత కొన్ని సంవత్సరాలుగా ‘జైష్ అల్ అదిల్’ ఇరాన్ భద్రతా దళాలపై అనేక దాడులు జరిపింది. డిసెంబరులో సిస్తాన్-బలూచిస్తాన్లోని ఒక పోలీసు స్టేషన్పై దాడి చేయగా. దాదాపు 11 మంది పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయినందుకు జైష్ అల్-అద్ల్ బాధ్యత వహించాడు.
Read More: 1941నాటి బాంబు.. ఇప్పుడు పేల్చేశారు..
ఉగ్రవాద సంస్థకు చెందిన రెండు ప్రధాన కార్యలయాలపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ పాకిస్థాన్లు పరస్పరం దాడులు జరిపాయి. పాకిస్తాన్, ఇరాన్ల భద్రతా సహకారాన్ని విస్తరించడానికి పరస్పరం అంగీకరించాయని ఓ మీడియా సంస్థ నివేదించింది. ఈ ఒప్పందాన్ని పాక్ విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలాండ్ అతని ఇరాన్ కౌంటర్ హోస్సేన్ అమీర్-అబ్దొల్లాహియాన్ పాక్ విదేశాంగ కార్యాలయంలో ప్రకటించారు.
ఇరు దేశాలు తమ తమ ప్రాంతాల్లో ఉగ్రవాదంపై పోరుకు, పరస్పరం ఆందోళనలు తగ్గించుకునేందుకు అంగీకరించాయని ఆయన తెలిపారు. హమాస్-ఇజ్రాయెల్ ఘర్షణలతో ఇప్పటికే ఉద్రిక్త సమయంలో ఇరాన్-పాక్ ఘర్షణపై ఆందోళన వ్యక్తమవుతోంది.