How to Cook Vegetables : మనం వంట చేసేటప్పుడు చేసే కొన్ని తప్పుల వల్ల కూరగాయల్లోని పోషకాలు పోతాయి. అందుకే వండేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మన ఆయుర్వేదం ప్రకారం వండిన తర్వాత ఆ ఆహారాన్ని 3 గంటల తర్వాత తినడం మంచిది కాదు. అందులోని పోషకాలు పోతాయి, కాకపోతే పులియబెట్టిన ఆహార పదార్థాల్లో మాత్రం పోషకాలు అలాగే ఉంటాయి. అంతేకాకుండా ఎక్కువ రోజుల తర్వాత మంచి బ్యాక్టీరియా కూడా పెరిగి మనకు ఎంతో ఆరోగ్యాన్ని అందజేస్తాయి. కానీ మిగతా ఆహార పదార్థాలను ఇలా లేటుగా తింటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఆహారం తేమకు గురైతే పోషకాలు తగ్గి బ్యాక్టీరియా, వ్యాధికారక క్రిముల సంతానోత్పత్తి పెరుగుతుంది. అందుకే ఆహారాన్ని వెంటనే క్లీన్ ఫిల్మ్ లేదా ఫాయిల్తో కప్పి ఉంచాలి. మంచి మసాలాలు వేసినా కూడా పోషకాహారం తయారవుతుంది.
మసాలాలను వంట చేసేటప్పుడు వేస్తుంటారు, కొన్ని వంటల్లో చివరిగా వేస్తారు. మధ్యలోనే వేస్తే వేడికి వాటిలోని పోషకాలు పోతాయి. అందుకే మిరియాలు, పసుపు, మసాలా దినుసుల్ని సరిగా వేయాలి. వంట చేసే ముందు రాత్రి కూరగాయలు, పండ్లని కట్ చేయడం చేయకూడదు. దీనివల్ల బ్యాక్టీరియా, క్రిములు పెరిగిపోతాయి. కట్ చేయడం వల్ల ఎంజైమ్స్ కూడా విడుదల అవుతాయి. దీంతో తాజాగా ఉన్నవి కుళ్లిపోతాయి. కూరగాయలు, మాంసాలు ఎక్కువగా వండటం వల్ల క్రిములు చనిపోతాయని అనుకుంటారు కానీ, ఇందువల్ల పోషకాలు కూడా నాశనమవుతాయంటున్నారు నిపుణులు. క్యారెట్, పుట్టగొడుగులు, కూరగాయలు, ఆకుకూరలు వండితే పోషకాలు పెరుగుతాయి.