PM Modi Speech in varanasi: సంత్ రవిదాస్ బోధనలను ప్రశంసిస్తూ.. 647వ జయంతి సందర్భంగా వారణాసిలో ఆయన విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. శుక్రవారం తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలోని సంత్ రవిదాస్ జన్మస్థలి పరిసరాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించారు.
సంత్ రవిదాస్ 647వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రధని మోదీ మాట్లాడుతు.. ‘సబ్కా సాథ్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ఔర్ సబ్కా ప్రయాస్’ అనే నినాధం అనుసరిస్తూనే ప్రస్తుత ప్రభుత్వం సంత్ రవిదాస్ బోధనలు, ఆదర్శాలను ముందుకు తీసుకువెళుతోందని అన్నారు.
కాశీ మినీ పంజాబ్ను తలపిస్తుంది అన్నారు. కాశీ నుంచి ప్రతినిధిగా సంత్ రవిదాస్ అనుచరులకు సేవ చేసే అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. సమాజంలో స్వాతంత్య్రానికి అర్థాన్ని అందించడంలో, సామాజిక విభజనలను తగ్గించడంలో సంత్ రవిదాస్ కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు. అంటరానితనం, వర్గవివక్ష, వివక్షకు వ్యతిరేకంగా గళం విప్పాన వ్యక్తి సంత్ రవిదాస్ అని తెలిపారు
Read more: Blue Aadhaar Card : బ్లూ ఆధార్ కార్డ్ అంటే ఏమిటి..?
ఆలయ ప్రాంతం అభివృద్ధి, రోడ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు వివిధ పథకాలను కూడా ప్రధాన మంత్రి వివరించారు. సాధువును అభిప్రాయాలు, మతం అనే సిద్ధాంతాలతో ముడిపెట్టలేమని ఆయన అన్నారు. రవిదాస్, ప్రతి ఒక్కరికీ చెందినవారని వివరించారు. ఈ రోజు గొప్ప సాధువు, సంఘ సంస్కర్త గాడ్గే బాబా జన్మదినాన్ని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు