IND vs ENG Fourth Test Updates: రాంచీ వేదికగా ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. జో రూట్ సెంచరీ సాధించాడు. క్రీజులో రూట్ ( 106*), రాబిన్సన్ (31*) పరుగులతో నాటౌట్గా ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు ఇన్నింగ్స్ను దూకుడుగా ప్రారంభించింది. అయితే ఈ మ్యాచ్తో అరంగ్రేటం చేసిన ఆకాశ్ దీప్ మూడు వికెట్లు తీసి ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. 47 పరుగుల వద్ద బెన్ డకెట్ (11) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. అదే ఓవర్లో ఓలీ పోప్(0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడిన ఓపెనర్ జాక్ క్రాలీ(42, 42 బంతుల్లో)ని క్లీన్ బౌల్డ్ చేశాడు.
Read More: ఇంగ్లాండుపై అశ్విన్ వంద వికెట్ల పండుగ.. తొలి భారత బౌలర్ గా రికార్డ్!
57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టును రూట్, బెయిర్ స్టో ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ దశలో బౌలింగ్కు వచ్చిన అశ్విన్ బెయిర్ స్టోను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ వెంటనే కెప్టెన్ బెన్ స్టోక్స్ను జడేజా ఎల్బీగా అవుట్ చేశాడు. 112 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టును రూట్, కీపర్ ఫోక్స్ ఆదుకున్నారు. టీ తర్వాత ఫోక్స్(47) సిరాజ్ బౌలింగ్లో జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టామ్ హార్ట్లీ(13)ను సిరాజ్ బౌల్డ్ చేశాడు.
భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ 3 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, అశ్విన్, జడేజా తలో వికెట్ తీసుకున్నారు.